
ఈ బొమ్మలొ రిక్షాపై వున్నది కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు. ఈ పొటొ గుంటూరులో తీసిన పోటో.
మన బ్లాగర్ శ్రీ శివరామ ప్రసాద్ గారు, ముళ్ళపూడి వారి కోత కొ0మ్మచ్ఛి కోసం పంపించారు. ఈమ్తకీ అసలు
సంగతి ఏమంటే పూర్వం ఇప్పటిలా ఆటోలు లెనప్పుడు , సైకిల్ రిక్షాల ముందు మనుషులు లాగే రిక్షాలు ఉండేవి.
ఒక మనిషి కూర్చుంటే మరో సాటి మనిషి బరువును లాగడము ఎంతో ఇబ్బంది కరమైన విషయం. ఏమిటొ ఆ
కాలంలో అలా అనిపించేది కాదు. ముఖ్యంగా మా రాజమండ్రి లాంటి ఊర్లలో కొన్ని రోడ్లు మెరకగా ఉంటె ,పాపం
ఎండలో చెమటలు కారుతూ లాగే వాళ్ళు. ఆ పాత రోజులు పోయాయి. ఇప్పుడు ఆటోలు వచ్చేశాయి.ఆ రోజులు
ఆ ఫొటో చూస్తే జ్ఞాపకం వచ్చి మీతో పంచుకోవాలనిపించింది.